పాన్గల్: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లాయిపల్లి గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి అనా రోగ్యంతో చికిత్స చేయించుకోగా రూ.2.50 లక్షలు, మాందా పూర్ పద్మకు రూ.53 వేలు, మాధవరావుపల్లి గ్రామంలో శివకుమార్రెడ్డికి రూ.50వేలు మంజూరయ్యాయని తెలిపారు.
ఆపద సమయాల్లో పేదలకు ఎంతో అభయమిస్తోన్న సీఎం రిలీఫ్ఫండ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని బాధితు లకు సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాముయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుపతి నాయుడు, ఎంపీటీసీ సుబ్బయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు రాంమ్మూర్తి నాయుడు, బాబురెడ్డి, సోమనాథ్, రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.