వనపర్తి, జనవరి 19(నమస్తే తెలంగాణ) : ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలభవన్, గోపాల్పేట హెల్త్సెంటర్లో రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు. అంధత్వాన్ని దూరం చేయడమే లక్ష్యంగా కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలే కారణమని కొనియాడారు.
వ్యవసాయం, పారిశ్రామికరంగంతోపాటు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు అందుతుండడం వల్ల ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. దీంతో పౌష్టికాహార సమస్య ప్రస్తుతం లేదన్నారు. ఉద్యమజెండా పట్టినప్పుడే తెలంగాణ సిద్ధిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేశామని, ఈ రోజు ప్రజలను చూస్తే సంతోషం వేస్తుందన్నారు. ప్రతి ఏటా ప్రజల జీవన ప్రమాణస్థాయి మెరుగు పడుతున్నదన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన శిశు జననాలు ఉం టాయన్నారు. కంటివెలుగు కార్యక్రమం 255 గ్రామపంచాయతీలు, 80 మున్సిపల్ వార్డుల్లో వందరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. 28 బృందాలు పనిచేసి 4,52,000 మందికి కంటి పరీక్షలు చేస్తారన్నారు. సం పూర్ణ అంధత్వ నివారణకు చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ప్రతిఒక్క రూ కంటి పరీక్షలు చేయించుకునేవిధంగా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని సూచించారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి రీడిం గ్ అద్దాలు ఇస్తారని, ఇప్పటికే 24,537 అద్దాలను అం దుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రీస్ర్కైబ్డ్ అద్దాలను వారంరోజుల్లో వైద్య సిబ్బందితో ఇంటి వద్దకే పంపించనున్నట్లు చెప్పారు.
గిన్నిస్ రికార్డు ఖాయం : కలెక్టర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ పథకం గిన్నిస్ రికార్డులో ఎక్కడం ఖాయమని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులను అందిస్తున్నట్లు తెలిపారు. కంటివెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, కంటివెలుగు ప్రత్యేకాధికారి తుకారాం బట్టు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ ఆనందరెడ్డి, కౌన్సిలర్ సత్యం, డీఎంహెచ్వో రవిశంకర్, జెడ్పీ సీఈవో శ్రావణ్కుమార్, సీపీవో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్, కంటివెలుగు టీం మానిటరింగ్ అధికారి పుష్పలత, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి, వైస్ఎంపీపీ రఘుయాదవ్, సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మా ణిక్యం, గాజుల కోదండం, ఎస్సీసెల్ నాయకుడు కోళ్ల వెంకటేశ్, యూత్ మండల అధ్యక్షుడు చిట్యాల రాము, కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.