వనపర్తి : జిల్లాలోని అమరచింత మండలం పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలోని (కేజీబీవీ) 40 మంది విద్యార్థులను విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్కు గురయ్యారు. బాధితులను ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ నుంచి మరికొంత మంది విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు.
అమరచింత కస్తూర్బా విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా దవాఖానకు తరలించగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా దవాఖానకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అమరచింత కు వెళ్లి అక్కడ గల పరిస్థితిని తెలుసుకోవాలని వైద్య బృందాన్ని పంపించారు.