వనపర్తి : అదుపుతప్పి కారు పల్టీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది. తల్లీకుమారుడు హైదరాబాద్ నుంచి కారులో కడప వెళ్తుండగా నాటవెళ్లి శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. కారు నడుపుతున్న కుమారుడు క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.