కల్వకుర్తి, సెప్టెంబర్ 26 : కులవృత్తిదారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఈదుల్ చెరువు, లింగసానిపల్లి గొల్ల చెరువులో మున్సిపల్ చైర్మన్ సత్యంతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీ త, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్చైర్మన్ విజయ్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు గణేశ్, కౌన్సిలర్ సూర్యప్రకాశ్, భోజిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు, మత్స్యకార్మికులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచించారు. కల్వకు ర్తి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ని సమావేశ మందిరంలో ఎంపీపీ సు నీత అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. అనంత రం సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా విద్యుత్ సమస్య ఉన్నదని చెప్పడంతో వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. బెల్టు దుకాణాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని సభ దృష్టికి తీసుకురాగా బెల్టు షాపులపై ప్రత్యేక నిఘా ఉంచి నియంత్రించాలన్నారు. ముకురాల నుంచి చిన్న ముకురాల వరకు రహదారి నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని, వేపూర్ గేట్ నుంచి మాధారం రహదారి వరకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంజుగుల-తుర్కలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కాజ్వేపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీటీసీ ప్రస్తావించగా అందుకు ఎస్టిమేట్ చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైస్ఎంపీపీ గోవర్ధన్, ఏఎంసీ చైర్మన్ బాలయ్య తదితరులున్నారు.