వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్రం వద్దన్న పార్టీనే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. జాతీయ భావం పేరుతో దేశభక్తికి పట్టాదారులా వ్యవ హరిస్తున్నదని కమలం పార్టీనుద్దేశించి మాట్లాడారు. మంగ ళవారం వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని పార్టీ వర్గ, వైషమ్యాలు రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేస్తూ అన్ని వర్గాల ఐక్య తను దెబ్బతీసున్నదని ధ్వజమెత్తారు.
స్వాతంత్య్ర ఫలితాలు అనేక మహానీయుల త్యాగ ఫలమని, అలాంటి గొప్ప ఘటన నేటి బాలలకు, వర్తమాన తరాలకు తెలియజేసే విధంగా సీఎం కేసీఆర్ పదిహేను రోజుల పాటు వజ్రో త్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంపిణీ చేసిన జాతీ య పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. గాంధీ, నెహ్రూ వంటి గొప్పనేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాలొగని జైళ్లల్లో మగ్గారని అన్నారు. స్వా తంత్య్ర ఫలాలు ప్రజలందరికీ చెంద కుండా కొంతమంది కార్పొరేట్ గద్దల కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపయోగి స్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంతోపాటు వేల కోట్లు ఎగ్గొట్టిన వారికి అండగా నిలిచిందని విమర్శించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో కలిసిరాని పార్టీనీ ఇప్పుడు పేదలకు అండగా నిలువని పార్టీని కడిగి వేయాలన్నారు.
స్వాతంత్య్రం గొప్పదనాన్ని తెలుసుకోవడానికి వజ్రోత్సవాలు ఎంతో ఉపయోగ పడు తాయని అన్నారు. గాంధీపై నిర్మించిన సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యా లయంలో మూడువందల మీటర్ల పొడవున్న జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్, అదనపు కలెక్టర్లు సెంగ్వాన్, వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, డీఆర్డీవో నర్సింహులు, అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.