మక్తల్, డిసెంబర్ 23 : మక్తల్ మండలంలో శనివారం ఆలయాల్లో వైకుంఠశోభ నెలకొన్నది. వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించా రు. పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పస్పుల కృష్ణానది తీరంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు.
పాలమూరు, డిసెంబర్ 23 : వైకుంఠ ఏకాద శి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కు లు తీర్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని సింహగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, పిల్లలమర్రి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. శ్రీవారిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణాలతో ఆలయాలు మార్మోగాయి.
మరికల్, డిసెంబర్ 23 : మండల కేంద్రంలో ని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆమ్మవారి దర్శనాన్ని ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వైకుంఠద్వార దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, డిసెంబర్ 23 : మండలంలోని ఆల యాల్లో శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడెబల్లూర్లో స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం, అలంకారం, వైకుంఠ ద్వారం పూజ, ఆరాధన నిర్వహించారు.
నారాయణపేట రూరల్, డిసెంబర్ 23 : ము క్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పేట పట్టణంలోని శ్రీఅనంతశయన ఆలయంలో శ్రీపద్మనాభస్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అ లాగే భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఏక్లాస్పూర్ బాలాజీస్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.
జడ్చర్ల/మిడ్జిల్/రాజాపూర్, డిసెంబర్ 23 : వైకుంఠ ఏకాదశిని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలో ని వైష్ణవ ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వారము ద్వారా స్వామివార్లను దర్శించుకోవడం జరిగిం ది. ఈ సందర్భంగా శనివారం తెల్లవారు జాము న నుంచే భక్తులు జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, మండలంలోని గంగాపూర్లోని శ్రీ ల క్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాల్లో ఉత్తరద్వారము ద్వారా భక్తులు స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్య లో తరలిరావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వార దర్శనంకోసం వచ్చే భక్తులకు ఆలయాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే బా దేపల్లిలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వా మి ఆలయంలో శనివారం ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జడ్చర్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామిని ఉత్తద్వారము ద్వారా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ లు చేశారు. మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, కొత్తపల్లి, రాణిపేట మసిగుండ్లపల్లి, చిల్వేర్, దోనూర్ తదితర గ్రామాల్లో ని పలు దేవాలయాల్లో ముక్కొటి ఏకదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో వేంకటేశ్వర్స్వామి ఆలయంలో భక్తులు తెలవారుజూమున ఉత్తర ద్వా రం నుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వాదినాన్ని పురస్కరించుకోని మండలంలోని రంగారెడ్డిగూడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీనివాసురెడ్డి, మాజీ జెడ్పీటీసీ హైమావతి బాల్రెడ్డి, సర్పంచ్ రాధిక వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర, డిసెంబర్ 23 : మండల కేంద్రంతోపాటు మండలంలోని లక్ష్మిపల్లి, చిన్నరాజమూర్ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులకు వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కు లు చెల్లించుకున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకోని ఆలయాల్లో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనం ఇచ్చారు.