పాలమూరు, ఫిబ్రవరి 13 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జనవరి 24నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలితాల్లో అన్విత 99.13 పర్సంటైల్, కీర్తన 95.92 పర్సంటైల్ సాధించారు. వీరితోపాటు ఐశ్వర్య, కస్తూరి, సాయి భరత్, రాధిక, అన్వితతోపాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్కు ఎంపికయ్యారు. మంగళవారం వీరిని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్తో పాటు జేఈఈ జాతీయ స్థాయి పరీక్షలో కూడా రాణించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే విధంగా కష్టపడి ఏప్రిల్లో జరిగే రెండో విడుత పరీక్షల్లోనూ అత్యుత్తమ పర్సంటైల్ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జి పావనీరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, అధ్యాపకుడు రాఘవేంద్రరావు, ఎంసెట్ ఇన్చార్జి షాకీర్, యాకూబ్, గోవిందరాజులు, కేశవులు, రాంరెడ్డి, భరత్ పాల్గొన్నారు.