మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ముందస్తుగానే తమ అభ్యర్థులను ప్రకటించాయి. పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు సహా ఏవీఎన్రెడ్డి, సంతోష్కుమార్, మల్లారెడ్డి, కాసం ప్రభాకర్, వినయ్బాబు, డాక్టర్ ఎస్.రవీందర్ తదితరులు బరిలో ఉన్నారు. తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో మరికొంత మంది అభ్యర్థిత్వాలు ఖరారు కానున్నాయి.
కాగా, ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 29,501 ఓటర్లున్నారు. ఎన్నికకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానున్నది. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 3వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. మార్చి 16వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.