పాలమూరు జిల్లా అభివృద్ధే తన కర్తవ్యమని.. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బుధవారం మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ పనులను కలెక్టర్ రవి, మున్సిపల్, పర్యాటక, ఇరిగేషన్, నిపుణులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువు వద్ద జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వానకాలం మురుగునీరు బండ్లోకి చేరకుండా అధికారులుచర్యలు తీసుకోవాలన్నారు. చెరువు పరిసర ప్రాంతాలను ఆక్రమణల నుంచి పరిరక్షించేందుకు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. త్వరలో పాలమూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న సీఎంకప్ క్రీడా పోటీల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ తిలకించారు.
మహబూబ్నగర్, మే 17 : అభివృద్ధే తన కర్తవ్యమని.. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ పనులను మున్సిపల్, పర్యాటక, ఇరిగేషన్ ఇంజినీర్లు, నిపుణులతో కలిసి మం త్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్యాం క్ బండ్ వద్ద జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆ దేశించారు. వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు చెత్తాచెదారం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ మురుగునీరు చెరువులోకి రాకుండా చేయాల్సిన పనులపై ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ఇరిగేషన్ అధికారులు తక్షణమే గేట్వాల్వ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో ఎంత వర్షం కురిసినా మురుగు కాలువల నుంచి సులభంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినా పట్టణ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నారు. గుర్రపు డెక్కను తొలగించేందు కు అవసరమైన మిషన్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సముద్ర ప్రాంతాల్లో పనిచేసిన నిపుణులను తీసుకొచ్చి మహబూబ్నగర్ ట్యాంక్బండ్ను చూపించినట్లు తెలిపారు. వారి సాంకేతిక పరిజ్ఞానంతో చెత్తా చెదారం, ట్యాంక్బండ్లోకి రాకుండా ఉండేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే పాలమూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వాటిని ఎ క్కడ ఏర్పాటు చేయాలి.. ట్రంక్ మెయిన్ ఎక్కడ పెట్టా లి.. మున్సిపల్ అధికారులు ప్రణాళిక రూపొందించి సా ధ్యమైనంత వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు.
చెరువు పరిసరాలను పరిరక్షించాలి : మంత్రి శ్రీనివాస్గౌడ్
పాలమూరు మినీట్యాంక్బండ్ చుట్టూ ఆక్రమణకు భూ మి గురికాకుండా అవసరమైన పర్యవేక్షణ నిరంతరం చే యాలని అధికారులను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పు డు ఉండాలని, సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలు సి ద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. అండర్గ్రౌం డ్ డ్రైనేజీతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఐటీ కారిడార్లో పరిశ్రమలు వస్తే పట్టణం చుట్టుపక్కల ఆస్తుల విలువలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదన్నారు. మం త్రి కేటీఆర్ అమెరికా వెళ్లారని, అక్కడి పారిశ్రామికవేత్త లు పాలమూరులో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొ స్తే వారిని ఆహ్వానిస్తామని తనకు హామీ ఇచ్చారని మం త్రి తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై రూ పొందించిన ప్రత్యేక వాల్పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఇంజినీరింగ్ అధికారి మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.