అచ్చంపేట, జనవరి 16 : నల్లమల కొండల్లో కొలువైన ఉమామహేశ్వరుడి కల్యాణం సోమవారం తెల్లవారుజామున కనులపండువగా జరిగింది. అచ్చంపేట, పదర, మన్ననూర్, నడింపల్లి, అమ్రాబాద్, పెనిమిళ్ల, రంగాపూర్, ఉప్పునుంతల, తెలకపల్లి నుంచి ప్రభోత్సవాలు ఉమామహేశ్వరం కొండకు చేరుకున్నాయి. ఆ తరువాత స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను కొండకింద ఉన్న భోగమహేశ్వరం కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి కల్యాణాన్ని వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణాల మధ్య వైభవంగా నిర్వహించా రు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించా రు.
కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్, ఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట కౌన్సిలర్ శివ ఇంటి నుంచి వీరభద్రసేవ నిర్వహించారు. నందికోళ్ల సేవ, నృత్యాలు ఆకట్టుకున్నా యి. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ ప్రతి గుంటకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామన్నారు. తన లక్ష్యం నెరవేరేలా ఆదిదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రజ లు ఆయురోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని వే డుకున్నట్లు చెప్పారు. ఉమామహేశ్వర, చెన్నకేశవస్వా మి రిజర్వాయర్ల పనులను త్వరలో సీఎం కేసీఆర్ చే తుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
మన్ననూర్ వద్ద ఏర్పాటు చేసే లిఫ్ట్కు రంగాపూర్ నిరంజన్షావలీ పేరు పెట్టనున్నట్లు తెలిపారు. ఉమామహేశ్వరం లో దాదాపు రూ.50లక్షల ఖర్చుతో అతిథి గృహ నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. అనంతరం ఉత్సవమూర్తుల ను ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ప్రభోత్సవంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, మహిళలు ఉన్నారు.