కల్వకుర్తి, డిసెంబర్ 22 : నాలుగేండ్ల కిందటి వర కు కల్వకుర్తి రైతులు వర్షాధార పంటలైన జొన్న లు, మొక్కజొన్న, పత్తి, కంది వంటి పంటలే ఎక్కువగా సాగుచేసేవారు. వర్షాలు సమృద్ధి గా కురిస్తేనే పంటలు పండేవి. బోరు బా వుల్లో నీరు ఉన్నా.. పావు, అర, ఎకరం అంటూ వరి సాగుచేసేవారు. ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ పా డి పశువులను బతికించుకునేవారు. అనావృష్టి వల్ల కరువు నేలగా మారిన కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో పొట్టకూటి కోసం పాడి, కాడెద్దులను కసాయిలకు విక్రయించిన రైతు కు టుంబాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సి ద్ధించాక అలాంటి దయనీయ పరిస్థితులను రైతులు అధిగమించారు. బీఆర్ఎస్ సర్కార్ ఎంజీకేఎల్ఐ పథకాన్ని పూర్తి చేయడంతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. నేడు కల్లాల్లో ధాన్యపు రాసులను నిల్వ ఉంచుకునే స్థాయికి రైతాంగం చేరుకున్నది.
ఎంజీకేఎల్ఐ 29వ ప్యాకేజీతో..
ఎంజీకేఎల్ఐలో భాగంగా 29వ ప్యాకేజీ పూర్తి కావడంతో మిడ్జిల్, క ల్వకుర్తి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాలకు సాగునీరందుతున్నది. ప్రధాన కాల్వలు కూడా పూర్తి కావడంతో పుష్కలంగా నీరు పారుతున్నది. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు ఉబికిస్తున్నాయి. ఆరు మండలాల్లో లక్ష ఎకరాలకు పైగా వరి సా గుచేస్తున్నారు. గతంలో పావు ఎకరా కూడా సాగుచేయడానికి నీరు లేని రైతు.. నేడు తనకున్న భూమిలో ఎక్కువ శాతం వరినే సాగు చేస్తున్నారు.
కల్వకుర్తి పీఏసీసీఎస్ పరిధిలో..
పుష్కలంగా సాగునీరు ఉండడంతో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సీ ఎం కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో ధా న్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టా రు. కొనుగోళ్ల బాధ్యతను మార్కె ట్ యార్డులు, పీఏసీసీఎస్, మ హిళా సంఘాలకు అప్పగించా రు. ఈ వానకాలంలో కేవ లం ఒక్క కల్వకుర్తి పీఏసీసీఎస్ పరిధిలోనే దాదాపు ల క్ష క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతేడాది వానకాలంలో 2,159 మంది రైతుల నుంచి 1,25,124 క్వింటాళ్లు, యాసంగిలో 1,96 9 మంది రైతుల నుంచి 1,16,977 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు.
ఈ ఏడాది వానకాలంలో 23 కేంద్రాల ద్వారా ఇప్పటికే 1,350 మంది నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 800 మంది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బంది ఉండొద్దన్న ఉ ద్దేశంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా క ల్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు డబ్బులను వారంలోపే ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటు ధర కల్పిస్తుండడంతో దళారుల ప్రమేయం లేకుండా పోయిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా..
కల్వకుర్తి పీఏసీసీఎస్ పరిధిలో రైతులు వరి సా గు ఎక్కువగా చేపట్టారు. దిగుబడి కూడా అధికంగా వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 23 ధాన్యం కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పించాం. తాగునీటి వసతి ఉన్నది. గన్నీ బ్యాగుల కొరత లేదు. వానకాలం సీజన్లో ఇప్పటి కే లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం సేకరిస్తున్నాం.
– తలసాని జనార్దన్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్, కల్వకుర్తి
నీళ్లు పుష్కలంగా ఉన్నాయి..
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పుణ్యమా అని నీళ్లు పుష్కలంగా ఉ న్నాయి. దీంతో మాకు ఉన్న పదెకరా ల్లో వరి సాగుచేశాం. వారం కిందట 400 బస్తాల ధాన్యం అమ్మాం. డ బ్బులు కూడా ఖాతాలో జమయ్యాయి. మిగతా ధాన్యాన్ని కల్లం వద్దకే వచ్చి తీసుకెళ్లారు. దళారుల ప్రమేయం లే కుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం. అంతే కాకుండా పంట వేసే సమయానికి రైతుబంధు డబ్బులు జమ అవుతున్నా యి. సాగునీరు ఫుల్లుగా ఉండడంతో మా బతుకులు బాగుపడ్డాయి. మా ఇద్దరు కొడుకులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– తేనేటి లావణ్య, రైతు, మాదారం