నాగర్కర్నూల్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఈగలు, దుమ్ము, ధూళితో కూడిన కలుషిత ఆహారం, తినుబండారాలను తీసుకోవడంతో పిల్లల్లో నులిపురుగు జన్మిస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, మరుగుదొడ్లకు వెళ్లడం వల్ల ఈ పురుగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ఆకుకూరలు, పండ్లు, వంట సరుకులను మంచినీటితో శుభ్రం చేయకుండా వండటం, అ న్నం తినే ముందు, తిన్న తర్వాత సరిగ్గా చేతులను క డుక్కోకపోవడం వల్ల కూడా ఈ పురుగులు జన్మించే పరిస్థితులున్నాయి. ఇలా నులి, కొంకి, ఏలికపాము వంటి పలు రకాల పురుగులు జన్మించి పిల్లల కడుపుల్లో స్థావరం ఏర్పా టు చేసుకుంటా యి. ఇవి పి ల్లల కడుపులో కి ప్రవేశించినప్పటి నుంచి అనారోగ్య లక్షణాలు కనిపిస్తా యి. ఫలితంగా వారు బరువు తగ్గడం, రక్తహీనత, ఆకలి మందగించడం, కడుపునొప్పి, పోషకాహార లోపంతో బలహీనంగా మారుతారు. ఎంత ఆహారం తీసుకున్నా అనారోగ్యంగా ఉంటారు. దీంతో పిల్లల్లో సంపూర్ణ ఎదుగుదల ఆగిపోతుంది. ఇది చదువు పైనా ప్రభావం చూపిస్తుంది.
ఇలా పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే నులి పురుగుల ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండుసా ర్లు నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తోంది. ఇందులో భాగంగా గురువారం జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనుంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఈ మాత్రలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల్లో విద్యార్థులకు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన ఈ మాత్రల పంపిణీకి వైద్యఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేపట్టిం ది.ఏడాది నుంచి 19 ఏండ్లలోపు పిల్లలందరికీ ఈ మాత్రలను తినిపించనున్నారు. గురువారం మాత్రలు తీసుకోని విద్యార్థులకు 27వ తేదీన వేస్తారు. ఈ మాత్రలను మధ్యా హ్న భోజనం తర్వాత వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో వేస్తారు. దీని కోసం జిల్లా, మండల టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మాత్రలు వే యడంపై వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. విద్య, శి శు సంక్షేమ, పంచాయ తీ, మున్సిపల్, ప్రైవే ట్ పాఠశాలల యాజమాన్యాలు, ఇతర వి ద్యాసంస్థల భాగస్వామ్యంతో మాత్రలను వందశాతం పంపిణీ చేసేందుకు
అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాంజిల్లాలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. పరిశుభ్రత పాటించకపోవడం, కల్తీ ఆహారం, తినుబండారాలను తినడం వల్ల పిల్లల కడుపులో నులి పురుగులు జన్మిస్తాయి. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చదువులోనూ వెనుకబడే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పాటించడం మేలు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో కలిపి 2,07,836 మంది పిల్లలకు మాత్రలు వేస్తాం. దీనికోసం 265మంది ఏఎన్ఎంలు, 2వేల మందికిపైగా అంగన్వాడీలు, 876మంది ఆశ కార్యకర్తలను నియమించాం.
నివారణ ఇలా
మలబద్ధకం ఏర్పడకుండా చూసుకోవాలి
వడపోసిన మంచినీళ్లనే తాగాలి
* భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
* పీచు పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి
* తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి