గద్వాల టౌన్, జూన్ 7 : భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో నక్షత్రం, కార్తె, రాశికి ప్రత్యేకత ఉంటుంది. అందులో మృగశిరానికి మ రింత విశిష్టత ఉన్నది. రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబురును చెబుతుంది. ఈ కార్తెలోనే రుతుపవనాల ఆగమనం జరుగుతుంది. అందువల్ల ఈ కార్తెను రైతులు ఏరువాకసాగే కాలం అంటూ సాగు పనులు చేపడుతారు. అదేవిధంగా ఈ కార్తెలో చేప లు విరివిగా తినడం వల్ల చాలా రోగాలు నయమవుతాయనే నమ్మకంతో అదే రోజున చేపమందును తీసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది.
అం తేకాక మృగశిర కార్తెకు పురాణాల్లో కూడా ఎంతో విశిష్టత ఉన్నది. ఈ కార్తె గురించి భగవద్గీత, పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉండడం విశేషం… మృగశిర కార్తెను ప్రతి ఏడాది జూన్ మాసంలో జరుపుకొంటారు. సూర్యుడు మృగశిరంలోకి ప్రవేశంచడంతో ఆ కార్తెను మృగశిరకార్తెగా పిలుస్తారు. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి చంద్రుడు 14 రోజుల సమీపంలో ఉంటాడు. అందుకు గానూ మృగశిర అనే పేరు వచ్చింది. ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. రోహిణి కార్తెలో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తె చల్లని వాతావరణాన్ని అందిస్తుంది.
తొలకరి జల్లులు కురిసి పుడమి చల్లబడి సాగుకు అనుకూలంగా మారుతుంది. దీంతో రైతన్నలు ఏరువాక సాగు పండగను ప్రారంభిస్తారు. వానలు ముందు గా కురవడంతో కాలం కలిసొచ్చినట్లేనంటూ రైతు లు సాగును సంతోషంగా ప్రారంభిస్తారు. మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతా ల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు బెల్లంలో ఇంగువను కలుపుకుని తింటారు. ఇది శరీరంలో ఊష్ణోగ్రతను ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం.
మృగశిర కార్తెలో చేపలు తినడం మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేడిని పుట్టించేందుకు చేపలను తింటారు. అంతేకాక చేపలు తినడం వల్ల ఉ బ్బసం, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే కొత్త నీరు వచ్చి చేరడంతో రోగాలు సోకే అవకాశం ఉన్నది. దీంతో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. రోగాల బారి నుంచి కాపాడుకుంటూ, రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలంటే చేపలు తినాల్సిందేనని పెద్దలు చెప్తుంటారు. ఈక్రమంలో చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.
నడిగడ్డలో మృగశిర కార్తె రాకను పెద్ద పండుగలా నిర్వహిస్తారు. కార్తె నాడు నల్లకోడి తినాల్సిందేనని మాంసాహార ప్రియులు ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతో మార్కెట్లో ఒక్కో నల్లకోడి ధర రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఉంది. శాకాహారులైతే మామిడిపండ్ల రసం, అట్లు తినడం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ.