బాలానగర్, నవంబర్ 30 : ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్హాళ్లు బుక్ అయ్యాయి. మార్కెట్లు సైతం కళకళలాడుతున్నా యి. డిసెంబర్లో కేవలం ఐదు ముహుర్తాలే ఉండడం తో వేల సం ఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో ఫంక్షన్హాల్లో రోజుకు కనీసం రెండు పెండ్లిళ్ల చొ ప్పున బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి వరకు ముహుర్తాలు లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు పేర్కొంటున్నారు.సాధారణంగా కార్తీకమాసంలో పెండ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈసారి మూఢాలు ఉండడంతో పెండ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. సెప్టెంబర్ 22న మొదలైన మూఢాలు గత నెల 27తో ముగిశాయి. దృక్ సిద్ధాంతం మేరకు డిసెంబర్లో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహుర్తాలు ఉన్నట్లు వేదపండితులు తెలిపారు. పూర్వ సిద్ధ్దాంతం ప్రకారం ఈ నెలలో అదనపు ముహుర్తాలు కూడా ఉన్నప్పటికీ ఐదు మాత్రమే ముఖ్యమైనవి కావడంతో దాదాపుగా పదివేల వరకు పెండ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువశాతం కన్యరాశి, సింహరాశి ముహుర్తాలే ఉన్నాయి. వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాల్లో గిరాకీ ఊపందుకున్నది.