మూసాపేట (అడ్డాకుల), జనవరి 19 : బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావె ల్స్ వోల్వో ఏసీ బస్సు టైరు ఊడిపోగా.. ఒక్కసారి గా మంటలు రావడంతో బస్సు డ్రైవర్లు అప్రమత్త మై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల కథనం మేరకు.. సీఎంఆర్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన వోల్వో ఏసీ బస్సు (ఏపీ 39 యూక్యూ 8584) గురువారం రాత్రి 7:30 గంటలకు బెంగళూరు నుంచి 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కర్నూల్ దాటిన తరువాత బస్సు వేగం పె రిగిన క్రమంలో షేక్ అవుతున్నట్లు డ్రైవర్ రాజు గ మనించి మరో డ్రైవర్కు చెప్పాడు.
అయితే శుక్రవా రం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బస్సు ముందు భాగంలో కుడి వైపు ఉన్న టైరు పూర్తిగా ఊడిపోయింది. వెం టనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. టైరు ఊడిపోయినా బస్సు ముందుకు వెళ్లడంతో నిప్పులు వచ్చాయి. డ్రైవర్లు రాజు, వినయ్, హెల్ప ర్ కలిసి మంటలు విస్తరించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. పెనుప్రమాదం త ప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీ ల్చుకున్నారు. అనంతరం ప్ర యాణికులను వేరే బస్సులో హైదరాబాద్కు తరలించారు. ఈ విషయం పై పోలీసులను వి వరణ కోరగా ఎ లాంటి ఫి ర్యాదు అందలేద ని చెప్పా రు.