కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 6 : సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పనుల్లో అవినీతి జరిగిందని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆరోపించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జూపల్లి హయాంలోనే పీఆర్ఎల్ఐ, మిషన్ భగీరథ పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. పీఆర్ఎల్ఐ పనులు 20 శాతం పూర్తయితే 90 శాతం నిధులు డ్రా చేసిన మంత్రి పొంగులేటి తమ మంత్రి వర్గంలోనే ఉన్నాడని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశం లో మాజీ మంత్రి పా ల్గొని మాట్లాడారు. రై తు లు కష్టాల్లో ఉంటే సీఎం మా త్రం ఐపీఎల్ టోర్నీలు చూ స్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కు మద్దతుగా బీఆర్ఎస్ దీక్షలు కొనసాగుతాయన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కమార్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించమని తేల్చి చెప్పారు. మంత్రి జూపల్లి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
స్థానికేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ఈ ప్రాంత సమస్యలు పట్టవని, ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడు మంద కృష్ణ మాదిగను కో రారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను ఓడించాలన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ని ర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ కా ర్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో సీనియర్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, రంగినేని అభిలాష్ రావు, ఎంపీపీలు రజిత, సోమేశ్వరమ్మ, కౌన్సిలర్లు కృష్ణ, కృష్ణమూరి,్త ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.