నారాయణపేట/రూరల్, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు హోం, జైళ్లశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హోంమంత్రితోపాటు ఎంపీ మన్నెశ్రీనివాస్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ హాజరయ్యారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కేసీఆర్ కా తోఫా ఖవాతిన్ కా భరోసా పథకం ద్వారా మై నార్టీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అ న్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదన్నారు.
షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రూ.20లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. సెక్రటరియేట్లో రూ.5కోట్లతో మసీదు నిర్మాణం చేపట్టామన్నారు. ఇమామ్, మౌజమ్లకు ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. కొత్త ఇమామ్, మౌజంలకు వేతనాలు మంజూరు చేస్తామన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మెన్ ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. గత పదేండ్లుగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. అనంతరం మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామ శివారులో రూ.19.92లక్షలతో ఏర్పాటు చేసిన ఏకో పార్కును హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అదేవిధంగా ఎకో పార్కులో పర్యావరణ విద్యామందిరానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని కలాల్వాడీలో రూ.5లక్షలతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి, పడో వార్డులో రూ.25లక్షలతో బీబీ దర్గా స్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ పాల్గొన్నారు.