కందనూలు,సెప్టెంబర్ 24: ఉమ్మడి పాలమూరు జిల్లా కవులు తమ కవిత్వాన్ని కొనియాడుతూ పంటపొలాలు సస్యశ్యామలమయ్యాయని.. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగిపోయాయని.. వలసలు నిలిచిపోయాయని.. పంటలు సంపదతో తులతూగుతూ రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయని తమ కవితలతో వినిపించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్హాల్లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో తరలివస్తున్న కృష్ణాజలాలపై వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా కవి సమ్మేళనం నిర్వహించారు.
కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకురాలు జయంతి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, నమస్తే తెలంగాణ చెలిమె సంపాదకీయ ఇన్చార్జి మధుకర్వైద్యుల, ఏషియన్ న్యూస్ సంపాదకుడు ఒద్దిరాజు ప్రవీణ్కుమార్, విద్యావేత్త భాసర్రావు, సాహితీవేత్త వీరయ్య, రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు కవులు మాట్లాడుతూ కృష్ణాజలాలతో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో బీడు భూములన్నీ పంటపొలాలై పచ్చని పరుపులయ్యాయన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలు జలమయమై సాగు, తాగనీరు పుషలమై కరువు అంతమై ఈ ప్రాంత రైతులు వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల జీవితాలు మారిపోయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు.
కృష్ణాజలాలతో ప్రజల స్వయం అభివృద్ధి, వ్యవసాయ అధారిత పనులన్నీ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అభిప్రాయపడ్డారు. కృష్ణాజలాల పంపిణీతో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా ప్రవహిస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని కొనియాడారు. ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ఎన్నోఏండ్ల పోరాటాల కృషి, ఉద్యమాలు, అమరణ నిరహార దీక్షలు, త్యాగాలతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కృషితో ఈ నాటికీ సాధ్యమై పాలమూరు జలదృశ్యం ఆవిషృతమౌతుందని కవులు తమకవిత్వాలతో గానం చేశారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బోల యాదయ్య, బైరోజు శ్యాంసుందర్, దేవదానం, అంబటి భానుప్రకాశ్, బైరోజు రాజశేఖర్, తాటి కృష్ణ, కేపీ లక్ష్మీనర్సింహ, కృష్ణయ్య, డా. గన్నోజు శ్రీనివాసాచారి, గౌరోజు గురుబ్రహ్మేంద్రదీక్షిత్, గడ్డంపల్లి భూపాల్రెడ్డి, మందాపురం సుజాత, గూడేలి శీనయ్య, రఘురాములుగౌడ్, దాదాపు 150మంది కవులు కవితాగానం చేశారు. కార్యక్రమంలో కందికొండ మోహన్, వహీద్ఖాన్ కల్వకోల్ మద్దిలేటి, వెంకట్పవార్, నీరటి బాలీశ్వర్, ఎదిరేపల్లి కాశన్న, దేవరపాగ కృష్ణయ్య, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.