అలంపూర్, డిసెంబర్ 12 : కార్తీకమాసం అమావాస్య సందర్భంగా అలంపూర్లోని ప్రముఖ శైవక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీకమాస చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ లయ ఈవో పురెందర్కుమార్ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.