నారాయణపేట టౌన్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవా రం పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత నిస్తున్నారని అందులో భాగంగా 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. దీం ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గరై మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.
కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి మంగళవారం వైద్యులు గ్రామాల్లో పర్యటించి మహిళలకు 8 రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారని తెలిపారు. వైద్య సేవలందించడంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని, ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని అభినందించా రు. ప్రభుత్వ దవాఖానల్లో 85శాతం వర కు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని 100శాతం చేరుకోవాలన్నారు. డయాలసి స్, ఆర్థోపెడిక్ సేవలు జిల్లా దవాఖానలో అందుబాటులో ఉన్నాయన్నారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వల్ల గర్భిణులకు పౌష్టికాహారం అందుతుందన్నా రు. త్వరలోనే నూతన జిల్లా దవాఖానను ప్రారంభించేందుకు సిద్ధ్దం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ పథకాలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆరోగ్యశాఖ ఉద్యోగులకు బహుమతు లు, రివార్డులు, ఆశ కార్య కర్తలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాంమనోహార్రావు, జిల్లా దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైద్యు లు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
కోస్గి, జూన్14: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య రోగ్యశాఖ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శిరీష స్థానిక ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, ప్రసవ సమయంలో కేసీఆర్కిట్లు, నగదు ప్రోత్సాహం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనుదీప్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.