మద్దూర్ (కొత్తపల్లి), డిసెంబర్ 23 : ఉద్యోగం లేకపోయినా ఫ ర్వాలేదు ఇంటికి రా అమ్మా అంటూ ఓ నిరుద్యోగ యువతి ఆవేదన చెందుతున్నది. మద్దూరు మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బసమ్మ దంపతులకు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నా రు. వెంకటయ్య తాసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా పనిచేసి రి టైర్డ్ అయ్యాడు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారడంతో ఏఎన్ఎం చదివిన తమ కూతురు నీలమ్మకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే కుటుంబానికి బాసటగా ఉంటుందని పది రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు బసమ్మతో కలిసి వెళ్లాడు.
వెంకటయ్య దరఖాస్తు చేసేందుకు బసమ్మను బయటే ఉంచి కార్యాలయానికి ఒక్కడే వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి బసమ్మ ఆ చూకీ లభించలేదు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నేటికీ ఆమె జాడే తెలియరాలేదు. కాగా, ఇంటి వద్ద కూతురు నీలమ్మ ఆందోళనతో ఎదురుచూస్తున్నది. వెంకటయ్య హైదరాబాద్లో వెతుకుతూనే ఉన్నాడు. పది రోజులైనా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు.. ఇంటికి రావాలని నీలిమ కంటతడిపెడుతున్నది.