జడ్చర్ల టౌన్, మార్చి 18 : ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పోలేపల్లిలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం మండలంలోని పోలేపల్లికి చెందిన జనార్దన్(30) పోలేపల్లి సెజ్లోని హెటిరోఫార్మా కంపెనీలో ఉద్యోగి. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్కు అలవాటుపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఆ దివారం రాత్రి తన ఇంట్లోనే ఇనుప పైపునకు వైర్ తో గొంతుకు చుట్టుకొని ఉరేసుకున్నాడు. దీన్ని గు ర్తించి కుటుంబసభ్యులు సోమవారం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల మా ర్చురీకి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.