నాగర్కర్నూల్, జనవరి 19 : కల్వకుర్తి బస్టాండ్లో వృద్ధురాలికి మాయమాటలు చెప్పి.. వేరే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన అనంతరం బంగారు ఆభరణాలు కాజేసి అచ్చంపేట అడవుల్లో చంపి కాల్చివేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పో లీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ నెల 15వ తేదీ న వృద్ధురాలు అ దృశ్యమైన ఘ టనపై పో లీసులు విచారణ చేస్తుండగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళ, పురుషుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. అనుమానితులుగా ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన కల్వకుర్తి మండలం తర్నికల్కు చెందిన నాగమ్మ(60).. వంగూరు మండలంలోని ఉల్పరలో ఉన్న తన కూతురు వద్దకు పండుగకు వెళ్తుండగా మాయమాటలు చెప్పి తాము ఆటోలో వదిలిపెడతామని క ల్వకుర్తి బస్టాండ్ నుంచి తీసుకెళ్లినట్లు చెప్పారన్నారు.
హత్యకు ఒ డిగట్టిన వారిని కల్వకుర్తి పట్టణానికి చెందిన వరికుప్పల వెంకటేశ్, తెలకపల్లి మండలం వట్టిపల్లికి చెందిన కల్మూరి అలివేలగా గుర్తించినట్లు తెలిపారు. వెంకటేశ్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. అలివేల భర్త చనిపోవడంతో వెంకటేశ్తో కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా ఉ ప్పునుంతల మండలానికి చెందిన బాలకిష్టమ్మను బల్మూ ర్ ప్రాంతంలో హత్య చేశామని ఒప్పుకొన్నట్లు వివరించా రు. అదేవిధంగా కడ్తాల్ మండలంలో 16 గొర్రెలు, మేకలను దొంగిలించిన కేసులోనూ వీరు నిందితులుగా ఉ న్నట్లు గుర్తించామన్నారు. వీరి నుంచి మొత్తం 5.8 తు లాల బంగారు, 6.5 తులాల వెండి వస్తువులతోపాటు 9 గొర్రెలను రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.