మరికల్, డిసెంబర్ 19 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును సోమవారం ఎ మ్మెల్యే ప్రారంభించారు. అలాగే మండలంలోని 30 మం దికి కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నా రు. ధన్వాడ మండలానికి డిగ్రీ కళాశాల, పోలీస్ స్టేషన్ భవ న నిర్మాణం కోసం నిధులు, నూతనంగా 9 గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం రూ.1.8కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు. నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని, పనులు చే యించుకునే బాధ్యత మీదన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి చెలకకు సాగునీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వాన్నిదేన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ నాగలక్ష్మి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వెంకట్రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యు డు వాహీద్, సర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, డిసెంబర్ 19 : సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆపరేషన్ల కోసం మం జూరైన ఎల్వోసీ పత్రాలను ఇద్దరు బాధితులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అం దజేశారు. మండలంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన రాములుకు గుండె శస్త్ర చికిత్స కోసం అవసరమైన రూ.2లక్షల 50వేల ఎల్వోసీ పత్రాన్ని ఆయన సోదరునికి, కోయిల్కొండ మండలకేంద్రానికి చెందిన మణెమ్మకు మెదడు శస్త్ర చికిత్స కోసం మంజూరైన రూ.2లక్షల 50వేల ఎల్వోసీ పత్రాన్ని ఆమె భర్త రాములకు అందజేశారు. కార్యక్రమం లో జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజొద్దీన్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, ప్రధానకార్యదర్శి రాజు, బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు మోహన్నాయక్, కోయిల్కొండ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కో సం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రైతు విశ్రాంత భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్ దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉచిత్ విద్యుత్, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలతోపాటు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం, కేంద్రం కొనుగోలు చేయకున్నా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ వస్తుందన్నారు. రైతులను ఆదుకున్నది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అనంతరం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల నిర్మాణాలకు ఎంపికైన ఆయా గ్రామా ల సర్పంచులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కర కుమారి, వైస్ చైర్మన్ జగదీశ్, డైరెక్టర్ రఘు, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, సింగిల్విండో చైర్మన్ కె.నర్సింహారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.