నారాయణపేట పట్టణంలోని వివిధ మండపాల్లో 10రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. యువకులు, మండపాల నిర్వాహకులు, భక్తులు భజనలు, పాటలకు నృత్యాలు చేయగా, పట్టణంలోని గణేష్ మార్గ్ మీదు గా శోభాయాత్రను వైభవంగా చేపట్టారు.
శోభాయత్ర లో పురాణ, ఇతిహాసాలు ప్రస్తుత సంఘటనలు, కదులుతున్న బొమ్మలతో అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి. చౌక్ బజార్లో విశ్వహిందూ పరిషత్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత సభలు ఏర్పాటు చేసి శోభాయాత్రలో పాల్గొన్న గణనాథులకు స్వాగతం పలికారు.
– నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 28