వనపర్తి, ఫిబ్రవరి 23 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో లాస్యనందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాస్యనందిత చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న ఆమె ప్ర మాదంలో మరణించడం బాధాకరమన్నారు. ఏడాది కిందట ఆమె తండ్రి చనిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి ఆమెకు కేసీఆర్ ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు గంధం రాజు అనారోగ్యంతో ఇటీవల గుండె ఆపరేషన్ చే యించుకొని జిల్లా కేంద్రంలోని ఇంటి వద్ద విశాంత్రి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు కృష్ణ, నాగన్నయాదవ్, కంచెరవి, ఎండీ గౌస్, జత్రూనాయక్, గులాం ఖాదర్, రహీమ్, జొహెబో, ప్రేమ్, వహీద్పాషా, తిరుపతయ్య, వెంకటయ్య, పరంజ్యోతి, విజయ్, డానియేల్, రాంచందర్, రాము తదితరులు పాల్గొన్నారు.