జాతీయ రహదారులపై వాహనదారుల టో(తో)లు తీస్తున్నారు. టోల్ప్లాజాల వద్ద ఉన్న ట్యాక్స్కు మరో
5 శాతం రుసుమును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుత్నుది.టోల్గేట్లను నిర్వహిస్తున్న ఏజెన్సీలు ఎక్స్ప్రెస్ వేల వద్ద పెరిగిన రుసుమును కొత్త ధరల ప్రకారం వసూలు చేస్తున్నారు.దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతున్నది. హైవేపై ప్రయాణం అంటేనే జంకుతున్నారు. కొన్ని చోట్ల సెప్టెంబర్లో పెంచుతామని ఆయా నిర్వహణ సంస్థలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండు హైవేలు ఉన్నాయి. ఎన్హెచ్-44పై మూడు టోల్గేట్లు, కోదాడ-రాయిచూర్ హైవేపై టోల్ప్లాజా ఉన్నది. ఈ ర్లోపై ప్రయాణమంటేనే హడలెత్తిపోతున్నారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జా తీయ రహదారులపై ప్రయాణం మరింత భారంగా మారింది. అ న్ని టోల్ప్లాజాల్లో ట్యాక్స్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో టోల్గేట్ల వద్ద ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా ఐదుశాతం కట్టాల్సి ఉంటుంది. టోల్గేట్లలో ఆయా ఎజెన్సీలు పెరిగిన టోల్ చార్జీల ప్రకారమే వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల సెప్టెంబర్లో పెంచుతామని సంస్థలు అంటున్నాయి. ఉమ్మడిజిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయి. హైదరాబాద్-బెంగళూరు 44వ జాతీయ రహదారితోపాటు కోదాడ- రాయిచూర్ జాతీయ రహదారి ఆయా జిల్లాల మీదుగా సాగుతుంది. బెంగళూరు జాతీ య రహదారిపై హైదరాబాద్ నుంచి మొదలు కర్నూలు వరకు మూడు టోల్ప్లాజాలున్నాయి. ఇక కోదాడ జాతీయ రహదారిపై మిడ్జిల్ మండలం వద్ద మున్ననూరు వద్ద కోదాడ-రాయిచూర్ టో ల్ప్లాజా ఉంది. సగటున రోజుకు సుమారు 20వేల నుంచి 50వేల వాహనాలు తిరుగుతుంటాయి. కాగా వాహనదారులపై ప్రతిరోజూ అదనంగా రూ.కోటి వరకు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం తాజాగా టోల్ చార్జీలు పెంచడమేంటని నిలదీస్తున్నారు. దీని ప్రభావం ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేట్ వాహనాల మీద పడుతున్నది. ఈక్రమంలో కేంద్రప్రభుత్వ చర్యలను ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇప్పటికే టోల్ చార్జీలను అడ్డగోలుగా వసూలుచేస్తున్న కేంద్రం తాజాగా సింగిల్ రిటర్న్ చార్జీలపై దాదాపు ఐ దుశాతం అదనపు భారం మోపింది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఐదుశాతానికి మించి టోల్ చార్జీలు వసూ లు చేస్తున్నాయి. సింగిల్ టోల్కు రూ.ఐదు, రిటర్న్టోల్కు రూ.పది అదనంగా వసూలు చేస్తున్నారు. పుల్లూరు టోల్ప్లాజా వద్ద నిన్నటి వరకు సింగిల్ జర్నీకి రూ.125 ఉండగా ప్రస్తుతం రూ.130 వసూలు చేస్తున్నారు. అదే వాహనం 24గంటల్లో రిటర్న్ వస్తే అదనంగా రూ.65కలిపి రూ.190 వసూలు చేయాలి. కానీ పెరిగిన ధరలతో సింగిల్ జర్నీకి రూ.ఐదు, రిటర్న్ జర్నీకి రూ.పది అదనంగా వసూలు చేస్తున్నారు. కేంద్రం పెంచిన టోల్ చార్జీల కారణంగా జాతీయ రహదారులపై ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే టోల్ చార్జీలే సుమారు రూ.1,500 అవుతున్నాయి. దీంతో వాహనదారులు హైవేపై జర్నీ అంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొన్నది
కేంద్రం అమానుషంగా పెంచిన టోల్ చార్జీల నిర్ణయం సరుకు, రవాణ వాహనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలపై అదనపు భారం పడుతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న క్రమంలో వాహనదారులపై కనికరం లేకుండా టోల్ చార్జీలు పెంచడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఈ నిర్ణయంతో నిత్యావసర వస్తువల ధరలపై కూడా ప్రభావం పడనున్నది. పరోక్షంగా వినియెగదారులపై, సామాన్యులపై అదనపు భారం పడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.
వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ చార్జీలో ప్రయాణికులకు అందించే సేవలతో కలిపి ట్యాక్స్ తీసుకుంటారు. ప్రయాకుడికి అందించే సేవల్లో.. అక్కడక్కడ ట్రక్లేబేలు, మూత్రశాలలు, బస్షెల్టర్లు, రహదారుల మధ్య పచ్చటి లాన్స్, ఎస్వోఎస్ ఫోన్లు అందుబాటులో ఉంచాలి. ఇవి ఎక్కడా కనిపించవు. రహదారికి ప్రతిఏటా మెయింటెనెన్స్ చేయాలి. ఎక్కడ రోడ్డు పాడయినా వెంటనే మరమ్మతు చేయాలి. ఈ బాధ్యత మొత్తం టోల్ వసూలు చేసే సంస్థలదే. కానీ వాహనదారులకు ఇలాంటి సేవలు అందించకున్నా కేంద్రం వారిని కాపాడుతూ వస్తోంది. అదేవిధంగా జాతీయ రహదారులపై 24గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉండాలి. హైవే పెట్రోలింగ్, వాహనాలు పాడైన వారికి తక్షణ సహాయం అందించేందుకు వీలుగా మొబైల్ మెకానిక్ సేవలు అందించాలి. ఇవి కూడా ఎక్కడా కనబడవు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను సమీప దవాఖానలకు చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్లే వస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రం పెంచిన టోల్ చార్జీలను తగ్గించాలని.. లేకపోతే ఆందోళనలు తప్పవని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.