జడ్చర్లటౌన్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బండి తీరును నిరసిస్తూ శనివారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్య లు చేసిన బండి సంజయ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ సీఐ రమేశ్బాబుకు ఫిర్యా దు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మ న్ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపలి లక్ష్మి, కౌ న్సిలర్లు, ముడా డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
భూత్పూర్, మార్చి 11 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భూ త్పూర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. బండిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమం లో మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, ముడా డైరెక్టర్ సాయి లు, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, గో ప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్గౌడ్, నాగయ్య, అశోక్గౌడ్, బోరింగ్ నర్సింహులు, ప్రతాప్, ప్రేమ్కుమార్, మహమూద్, సత్యం, బ్రహ్మయ్య పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు. అడ్డాకులలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బి.తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
మూసాపేట, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని ఆదర్శ మహిళాసెంటర్ నుంచి బండి సంజయ్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి జాతీయరహదారిపై దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, శివరాములు, గూపని కొండయ్య, అచ్చాయిపల్లి చంద్రశేఖర్, లక్ష్మణ్, మశ్చేందర్నాథ్ పాల్గొన్నారు.
నవాబ్పేట, మార్చి 11 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ మండల మహిళావిభాగం ఆధ్వర్యంలో నవాబ్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండి సంజయ్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, గంగమ్మ, ఎంపీటీసీ జ్యోతి, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మహిళా నాయకులు రుద్రారం లక్ష్మి, బాలమణి, పోమాల లక్ష్మి, మల్లీశ్వరి, స్వాతి, యశోద, నాయకులు కృష్ణగౌడ్, కృష్ణయ్య, చెన్న య్య, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మండలకేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను కించపర్చేలా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు డోకూర్ నరేందర్రెడ్డి, శివానంద్, శ్రీకాంత్యాదవ్, బాలరాజు, ఉప్పరి సత్యం, కొండా శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, చాల్మారెడ్డి, యుగేందర్రెడ్డి, తుమ్మల శేఖర్రెడ్డి, గౌస్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మిడ్జిల్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ మండలకేంద్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచులు మంగమ్మ, జంగిరెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు జైపాల్రెడ్డి, బాలు, ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, జగన్గౌడ్, నవీన్, వీరేశ్, భాస్కర్, వెంకటయ్య, నర్సింహ పాల్గొన్నారు.
బాలానగర్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. అనంతరం ర్యాలీగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని దేశాయిపల్లి క్రాస్రోడ్డుపై బీఆర్ఎస్ ఉమ్మడి మండల నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎ మ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భిక్షపతి, పెంట్యానాయక్, పీఏసీసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ముందరితండా సర్పంచ్ నీలేశ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి, భీమయ్య పాల్గొన్నారు.
కోయిలకొండ, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మహిళలను అగౌరవపర్చేలా మాట్లాడిన బండిపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.కృష్ణయ్య, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, టీవీ ఖాజా, కరుణాకర్రెడ్డి, ఆంజనేయులు, లక్కీగౌడ్, నజీం, మొగులయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
రాజాపూర్, మార్చి 11 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. బండి వ్యాఖ్యలు మహిళల మనోభావాలకు భంగం కలిగేలా ఉన్నాయని, మహిళలకు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాములమ్మ, నరహరి, యాదగిరి, ఎంపీటీసీ శేఖర్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ తిరుపతయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, సత్యయ్య, పాండూనాయక్, నజీమ్, నర్సింహులు పాల్గొన్నారు.