కొల్లాపూర్, జూలై 3: ఎన్నో దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు అందజేయడంతో గిరిజనులు ఖుషీగా ఉన్నారు. కొల్లాపూర్ మం డలం ముక్కిడిగుండం జీపీ పరిధిలోని గేమ్యాతండాలో 83 కుటుంబాలకు 263. 59 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి శనివారం అందజేశారు. దీంతో తండాలోని సగంమంది గిరిజన మహిళలు సోమవారం ఆనందంతో సాంప్రదాయ నృత్యం చేస్తూ పొంగిపోయారు. సర్కారు తమకు పోడు పట్టాలను ఇవ్వడంతో ఇక మీదట అటవీ అధికారుల నుంచి వేధింపులు ఉండవని, ధైర్యంగా సాగు చేసుకోవచ్చని సంతోషం వ్యక్తం చేశారు.
50 ఏండ్లకు పైగా తమ తండాకు సమీపంలో ఉన్న జాలోని కొత్తపల్లి, మేకగుండుతువ్వ అటవీ ప్రాంతం లో మూడువందల ఎకరాలకు పైగా భూమి ని తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తండాకు చెందిన లక్ష్మి, రుక్మిణి, అలివేలు, మంగమ్మ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనస్సుతో మాపై దయ చూపి పట్టాలు పంపిణీ చేయడంతో సంతోషంగా ఉన్నామన్నారు. తమకు పోడు పట్టాలు ఇచ్చిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని తండావాసులు పేర్కొన్నారు.