మహబూబ్నగర్, జూన్ 2 : దేశం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టిం పు స్థాయిలో ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, ప్రజాప్రతినిధుల తో కలిసి మంత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ముం దుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రెండు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం జాతీయ జెండా ను ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్ది కాలంలోనే శతాబ్ది అభివృద్ధి సాధించామన్నారు. నిత్యం అమరవీరులను తలుచుకుంటామన్నారు. వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం సా గించారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, ప్రజలు ముఖ్తకంఠంతో ఉద్యమం చే శారని గుర్తుచేశారు.
కేవలం పదేండ్లలోనే వం దేండ్ల అభివృద్ధి సాధించామన్నారు. గత ప్రభుత్వాలు రైతుల కోసం కేవలం రూ.7,994 కోట్లు వెచ్చించగా.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.1,91,612 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇది గతంతో పోల్చితే 20 రెట్లు ఎక్కు వ అని అన్నారు. కొన్ని చెరువుల్లో నామమాత్రం గా 50 శాతం సబ్సిడీతో చేపపిల్లలను ఇచ్చేవారని, రాష్ట్ర ఏర్పాటు తరువాత రూ.8.92 కోట్ల రాయితీతో చేపపిల్లలను వదిలామన్నారు. మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పించేందుకుగానూ 75 శాతం సబ్సిడీ కింద రూ.19.1 కోట్లతో 2,034 వాహనాలు, 88 వలలు, 76 కియోస్కులతోపాటు తదితర సామగ్రిని పంపిణీ చేశామన్నారు. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ప్రతి రంగానికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.
రాత్రి, పగలు తేడా లేకుండా ఎంతో శ్రమించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. రైతుబంధు, రై తుబీమా, కంటివెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, అమ్మఒడి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, గొ ర్రెల పంపిణీ, దళితబంధు, చేప పిల్లల పంపిణీ, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, జిల్లాకో మెడికల్ కళాశాల వంటి ఎంతో అభివృద్ధిని మన సొంతం చేసుకున్నామన్నారు. కరువు జిల్లా అనే పేరు తుడిచిపెట్టుకుపోయి.. నేడు పచ్చని పంటలకు నిలయంగా మారిందన్నారు. పాలమూరు జిల్లాకే వలసలు వ స్తున్నారన్నారు. మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటామని వివరించారు. ప్రతిక్షణం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. అ నంతరం ప్రభుత్వ సహకారంతో వచ్చిన వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. అమరవీరు ల కుటుంబసభ్యులను శాలువ, పూలమాలలతో సత్కరించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన స్టాల్స్ను మంత్రి శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు సందర్శించారు. విద్యార్థుల సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వారికి మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు యాదయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్ పాల్గొన్నారు.
అమరవీరుల స్తూపానికి నివాళి..
పాలమూరు, జూన్ 2 : జిల్లా కేంద్రంలోని ఆ ర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, డీసీసీబీ ఇన్చార్జి చై ర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.