వెల్దండ మార్చి 9: హైదరాబాద్లోని బాలాపూర్లో వెల్దండ మండలం కేస్లీ తండాకు చెందిన యువకుడు దారుణ హత్యకుగురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండావాసుల కథనం మేరకు కేస్లీ తండాకు చెందిన డేగావత్ బుజ్జి, పూల్సింగ్ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్లోని బాలాపూర్లో ఉంటూ మేస్త్రీ పనిచేస్తూ జీవనం గడిపేవాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, కు మారుడు పవన్(18) ఉన్నా రు. ఇంటర్ చదివిన పవన్ బాలాపూర్కు చెందిన ఓ యు వతిని ప్రేమించాడు. విష యం తెలిసిన స్థానిక యువకులు ఇద్దరు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేసి నడిరోడ్డుపై హతమార్చినట్లు తెలిపారు. నిందితులను కఠినం గా శిక్షించాలని పవన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
బిజినేపల్లిలో యువకుడు..
బిజినేపల్లి, మార్చి 9 : మం డల కేంద్రంలో ఓ యువకుడు హత్యకుగురయ్యాడు. పోలీసు ల కథనం మేరకు బిజినే పల్లికి చెందిన భానుప్రసాద్(18), అదే గ్రామానికి చెందిన విక్టర్ బుధవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని సంతబజార్ టెంట్ హౌస్ సమీపంలో మద్యం సేవించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో విక్టర్ పక్కనే ఉన్న కూరగాయల కత్తితో భానుప్రసాద్ను ఛాతిలో పొడిచాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. వారు వెంటనే అంబులెన్స్లో నాగర్కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందా డు. మృతుడి తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ఓబుల్రెడ్డి తెలిపారు.