జడ్చర్లటౌన్, జూన్ 10 : న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ప్రిన్సిపల్ కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం లో భాగంగా శనివారం జడ్చర్లలోని ప్రిన్సిపల్కోర్టు, అడిషనల్ కోర్టుల్లో జడ్జిలు టి. లక్ష్మి, చైతన్యఅంగారీ సమక్షంలో లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను తగ్గించేందుకు లోక్ఆదాలత్ కార్యక్రమం ఎంతో ఉ పయోగపడుతున్నదన్నారు. అనంతరం ప్రిన్సిపల్ కోర్టు లో జడ్జి లక్ష్మి, అడిషనల్ కోర్టులో జడ్జి చైతన్య అంగారీ సమక్షంలో పలు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వర్, ఏపీపీలు రామకృష్ణ, దీపిక, లోక్అదాలత్ స భ్యులు ఇఫ్తేకారొద్దీన్, ప్రశాంత్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు, బ్యాంకు అధికారులు ఉన్నారు.
మహబూబ్నగర్లో..
మహబూబ్నగర్, జూన్ 10 : అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న వారందరికీ రాజీతో ఒప్ప దం కుదుర్చుకొని ముందుకుసాగడంతో ఎంతో ఉపశమ నం ఉంటుందని జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. రాజీ చేసుకుని ముం దుకు సాగితే జీవితం అనందంగా ఉంటుందన్నారు. రా జీ చేసుకుని ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించి ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉన్న వారు సెటిల్మెంట్ ద్వారా బ్యాంక్లకు తిరిగి పరస్పర అంగీకారంతో ఉండడం మంచి విధానామని, రుణగ్రహీతలు ఈ విషయాన్ని గమనించాలని యూనియన్ బ్యాంక్ డిప్యూ టీ రీజినల్ అధికారి కృష్ణమూర్తి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్లో లోక్ అదాలత్ నోటీసులతో 93 కేసులకు సంబంధించి పరస్పర అంగీకారంతో రూ.13.05 లక్షలు వరకు క్యాష్ రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో జడ్జిలు రాజపుడి శ్రీదేవి, వై. పద్మ పాల్గొన్నారు.