భూత్పూర్, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. గురువారం మండంలోని పెద్దతండా, కొత్తమొల్గరలో కంటివెలుగు శిబిరం నిర్వహించారు. పెద్దతండాలో 103మందికి పరిక్షలు నిర్వహించి 9మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. కొత్తమొల్గరలో 1,236 మందికి పరీక్షలు నిర్వహించి 184మందికి అద్దాలను పంపి ణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్బ్బ్రు, రాధిక, హిమబిందు, సూపర్వైజర్లు యాదమ్మ, సుధాకర్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 16: గ్రామాల్లో చేపట్టిన కంటివెలుగు శిబిరంలో ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని పీహెచ్సీ డాక్టర్ శరత్చంద్ర అన్నారు. గురువారం మండలకేంద్రంతోపాటు చౌదర్పల్లిలో కంటివెలుగు శిబిరం నిర్వహించారు. దేవరకద్రలో 95, చౌదర్పల్ల్లిలో105 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 16: రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు మండలంలోని ఆయా గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం కౌకుంట్ల మండల కేంద్రంతోపాటు దాసర్పల్లి, చిన్నచింతకుంట మండల కేంద్రంలో కొనసాగుతున్నాయి. కౌకుంట్లలో 126మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 32మందికి అద్దాలు పంపిణీ చేశారు. చిన్నచింతకుంటలో 115 మందికి కంటి పరీక్షలు చేసి ఇద్దరికి అద్దాలు అందజేశారు. దాసర్పల్లిలో 131 మందికి పరీక్షలు చేసి 39మందికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో కంటివెలుగు అధికారులు డాక్టర్ సనా, సంతోశ్, షఫీఖ్, డాక్టర్లు రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, శ్రీనివాసులు, వైద్యనిపుణుడు ఖాదర్, సూపర్వైజర్ సుశీల, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 16: పట్టణంలోని 6వ వార్డులో 121మందికి గురువారం వైద్యాధికారులు కంటి పరీక్షలు నిర్వహించారు. 32మందికి కంటి అద్దాలు అందజేశారు. 17వ వార్డులో 110మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు ఆర్బన్ హెల్త్సూపర్వైజర్ శివకాంత్ తెలిపారు. మండలంలోని ఆలూర్, చిట్టెబోయిన్పల్లిలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆలూర్లో 92మందికి కంటి పరీక్షలు చేయగా 10మందికి కండ్లద్దాలు అందజేశారు. చిట్టెబోయిన్పల్లిలో 91మందికి పరీక్షలు నిర్వహించగా, 12మందికి అద్దాలు అందజేసినట్లు పీహెచ్సీ డాక్టర్ సమత, వైద్యసిబ్బంది తెలిపారు.
రాజాపూర్, ఫిబ్రవరి 16: మండలంలోని ఇబ్రహీంపల్లి లో గురువారం 116మందికి కంటి పరీక్షలుచేసి 33మందికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్రావు, కోఆర్టినేటర్ శ్రీనివాసులు, డాకర్లు మౌనిక, రవికుమార్, ఉత్తరయ్య, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 16: మండలంలోని వల్లబురావుపల్లి, బోయిన్పల్లిలో కంటిపరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం 274మందికి పరీక్షలు నిర్వహించగా 31మందికి అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో మ నూశ్రీ, కృష్ణకుమార్, సర్పంచులు నాగమ్మ, నారాయణరెడ్డి, ఎంపీటీసీ నర్సింహ, వైద్యసిబ్బంది దేవయ్య, జంగ య్య, నాయకులు, ఏన్ఎంలు పాల్గొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 16: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మోతీఘణపూర్లో 124మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 14మందికి అద్దాలు అందజేశారు. ఆరుగురికి అర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. పెద్దరేవల్ల్లి 149మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 17మందికి కండ్లద్దాలు ఇవ్వగా, మరో 4నలుగురికి అర్డర్ పెట్టినట్లు చెప్పారు. అంతకుముందు పెద్దరేవల్లిలో ఎంపీడీవో కృష్ణారావు పరిశీలించారు.
బాలానగర్, ఫిబ్రవరి 16 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని మోతీఘణపూర్లో 124మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 14మందికి కండ్లద్దాలు అందజేశారు. 6మందికి అర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే పెద్దరేవల్ల్లిలో 149మందికి కంటి పరీక్షలు, 17మందికి కండ్లద్దాలు ఇవ్వగా, మరో నలుగురికి అర్డర్ పెట్టినట్లు చెప్పారు. అంతకుముందు కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో పరిశీలించారు.