వనపర్తి జిల్లాలోని పలువురు సర్వేయర్లు హద్దు మీరుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం పెడుతున్నారు. సొంత పనుల నిమిత్తం డుమ్మా కొడుతుండడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఏకంగా జిల్లాలోని ఏడుగురు ఇష్టానుసారంగా గైర్హాజరయ్యారు. లీవ్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ యాస్మిన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి మెమోలు జారీ చేయడంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఇద్దరు విధులకు హాజరవగా.. ఐదుగురు డ్యూటీకి రావడం లేదు. పూర్తి
స్థాయిలో స్టాఫ్ లేకపోవడంతో విధుల్లో ఉన్న మిగతా సర్వేయర్లపై భారం పడుతున్నది. మరో వైపు రైతులు, రియల్టర్లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వనపర్తి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కొత్తగా నియమకాలు చేపట్టి మండలాలకు కేటాయిస్తే విధులకు డుమ్మా కొడుతున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మూకుమ్మడిగా విధులకు ఎగనామం పెడుతున్నారు. దీం తో ప్రజలు, రైతులు, రియల్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వేయర్లకు జిల్లా స్థాయి అధికారి అండదండలు ఉండడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయపై కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సీరియస్ అయ్యారు.
సద రు సర్వేయర్లకు మెమోలు జారీ చేసి, రాష్ట్ర ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు, కొత్తకోట, గోపాల్పేట, పాన్గల్, రేవల్లి, పెబ్బేరు, మదనాపు రం సర్వేయర్లు గైర్హాజరు కావడంతో జిల్లా ఉన్నతాధికారిపై కలెక్టర్, రాష్ట్రస్థాయి అధికారులు సీరియస్ గా స్పందించినట్లు తెలిసింది. ఏడుగురిలో పెబ్బేరు, మదనాపురం సర్వేయర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సర్వే విభాగం జిల్లా ఉన్నతాధికారి బాలకృష్ణ తెలిపారు. పెద్దమందడి, అమరచిం త మండలాల్లో సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖిల్లాఘణపురం సర్వేయర్ మెడికల్ లీవులో ఉన్నందున మిగతావారిపై భారం పడుతుందన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదులు..
ప్రజావాణిలో సర్వేయర్లపైనే అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వే చేయాలని దరఖాస్తు చేసుకు న్నా.. ఎవరూ రావట్లేదని కలెక్టర్కు వినతులు అం దుతున్నాయి. ‘ఒక రైతు తన కూతురు పెండ్లి నిశ్చయమై ఖర్చుల కోసం భూమిని అమ్మకానికి పె ట్టాడు. మొన్నటి పెండ్లింళ్ల సీజన్లో ముహూర్తం ఫి క్స్ చేసుకున్నారు. అయితే, భూమిని కొలిచి ఇస్తేనే డబ్బులు చెల్లిస్తానని కొనుగోలు చేసిన వ్యక్తి తేల్చి చెప్పాడు. కూతురు వివాహ ముహూర్తం ముంచుకొస్తున్నా.. సర్వేయర్ కొలతకు రాలేదు. ఫీజు చె ల్లించి కాళ్లా వేళ్లా పడినా ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టుకొ ని కొనుగోలుదారుడి నుంచి డబ్బు ఇప్పించారు. దీంతో పెండ్లి జరిగింది.’ ఇలా ఒక్క రైతుకే కాదు చాలా మందికి జరుగుతున్నది. వనపర్తి జిల్లా కేం ద్రంలో అభివృద్ధి పనుల కోసం ఎప్పుడూ బిజీగా ఉండే సర్వేయర్కు మిగతా మండలాల్లో అవసరానికి ఉపయోగించుకోవడంతో ఇక్కడ సర్వే పనులు పెండింగ్లో ఉంటున్నాయి.
ఫిర్యాదులు అందాయి..
ప్రజావాణిలో భూ సర్వేలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వా టి పరిష్కారంపై దృష్టి సారించాం. సమాచా రం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన వారికి మెమోలు జారీచేశాం. వారు ఇచ్చిన వివరణ సరిగ్గా లేకపోవడంతో రాష్ట్రస్థాయి సర్వే విభాగానికి రిపోర్టు ఇ చ్చాం. వారి ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్య లు తీసుకుంటాం. సర్వేకు ఇబ్బంది కాకుం డా ఉన్న టీంతో సరిపెట్టుకుంటున్నాం.
– షేక్ యాస్మిన్బాషా, కలెక్టర్, వనపర్తి