వనపర్తి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రకటించిన అన్నపూర్ణ పథకం నిర్వహణకు సన్నాహాలు ప్రారంభ మయ్యా యి. ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సన్నబియ్యం పథకాన్ని ప్రకటించిన సంగతి విధితమే. ఇంతకాలం నిరుపేదలు దొడ్డుబియ్యా న్ని చౌకధర దుకణాల ద్వారా పొందుతున్నా రు. అయితే నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కొత్త పథకాన్ని ప్రకటించారు. దీం తో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పేదల కడుపు సన్నబియ్యం అన్నంతో నిండబోతుంది. ఇందుకు అవసరమైన కార్యాచరణను జిల్లా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేయడంలో నిమగ్నమైంది.
జిల్లాలో లక్షా 57,114 రేషన్కార్డులున్నాయి. వీటిలో లక్షా 46వేలు తెల్లకార్డులు కాగా, అం త్యోదయ 10,190, అన్నపూర్ణ 110 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతి నెలా 2,4 94 మెట్రి క్ టన్నుల బియ్యం పేదలకు చౌకధర దుకాణాల ద్వారా అందుతున్నాయి. ఇది లా ఉంటే, నూతనం గా ప్రకటించిన అన్నపూర్ణ పథకంపై జిల్లాలోని పేద లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు దొడ్డు బియ్యం కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనున్నప్పటికీ సీఎం కేసీఆర్ పేదలకు సన్నబియ్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం వచ్చే ఏప్రిల్-మే నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
ఇంతకాలానికి నిజమైన పేదవాడికి కడుపునిండా సన్నబియ్యం అన్నం దొరుకుతుందంటే ఓ అదృష్టంగా భావిస్తున్నారు. పొద్దస్తమానం కష్టం చేసిన కూలీ జనాలకు సన్నబియ్యంతో అ న్నం తినాలంటే కష్టసాధ్యం. కిలో రూ. 50మొదలుకుని రూ. 100 వరకు సన్న పలుకుతాయి. ఈ క్రమంలో నిరుపేదలు సన్నబియ్యం కొ నుగోలు చేసి ఆకలిని తీర్చుకునే పరిస్థితులు చాలా తక్కువ. బడుల్లో మధ్యా హ్న భోజన పథకం సన్నబియ్యంతో ప్రారంభించినప్పటి నుంచి అక్కడ అనేక మార్పు లు వచ్చాయి. బడిలో పిల్లల శాతం పెరగడమే కాకుండా, భోజనం చేసే విద్యార్థుల సం ఖ్య కూడా పెరిగింది. చా లా మంది విద్యార్థులు ఇంటి కి వెళ్లి భో జనం చేసే వారు. సన్నబియ్యం అన్నం వచ్చిన అ నంతరం ఇంటికి వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.ఈ క్రమం లో సీఎం పుణ్య మా అం టూ నిరుపేదలందరికీ సన్నబియ్యం అన్నం అందుబాటులోకి వస్తుండటం మహా గొప్ప కార్యంగా పేదలు భావిస్తున్నారు.