రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు.