మహబూబ్నగర్, ఫిబ్రవరి 18 : అందరి జీవితాల్లో ప్రతి రోజూ బ్రహ్మాండమైనదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్ అన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూ నివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇంటర్మీడియెట్ తరువాత ఉన్నత విద్యా అవకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట జిల్లా కేంద్రంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో ప్రతిభ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షణ్ముఖకుమార్ మాట్లాడుతూ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉన్నా కొందరు మాత్రమే అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణిస్తారని తెలిపా రు. ప్రతి దానికి లిమిట్ ఉన్నా మనిషి ఆదాయానికి మా త్రం లిమిట్ లేదన్నారు. చెరువులో చేప, కుందేళ్లకు పరు గు, సింహానికి వేటాడడం ఇలా ఏ జీవి అయినా.. తనకు తాను నేర్చుకుంటుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో యూట్యూబ్, గూగుల్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా మనిషి పరిజ్ఞానాన్ని పెంచుకునే వెసులుబాటు ఉందన్నారు. గురువుతో పనిలేదనే స్థాయికి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వచ్చేశారని తెలిపారు. ఈ కాలంలో నాకు ఒకే పని వస్తది.. మిగతా విషయాల్లో పరిజ్ఞానం లేదంటే కుదరదని, అన్ని పనుల్లో ప్రావీణ్యం ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ సందర్భంగా ఒక కథను ఉదహరిస్తూ ‘ఒక ఆవు, సింహం, మనిషి.. ముగ్గురు అన్ని వస్తువులు, తినుబండారాలు లభించే షాపింగ్ మాల్కు వె ళ్తారు.
ముందుగా ఆవు షాపింగ్కు వెళ్లి తనకు అవసరమైన ఆకుకూరలు, గడ్డి తిని వెనక్కి వస్తుంది. సింహం వెళ్లి మాంసాన్ని తిని తిరిగొస్తుంది. మనిషి వంతు వచ్చే సరికి మాల్లోకి వెళ్లి బయటికి రాకుండా అక్కడే తిరుగుతుంటా డు. ఎంతకీ బయటకు రాకపోవడంతో గురువు మాల్ లో పలికి వెళ్లి అతడిని ఎందుకు బ యటకు రావడం లేదని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మనిషి నాకు అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ.. ఏది ఇప్పుడు తీసుకోవాలో తెలియడం లేదని సమాధానమిస్తాడు. దీంతో మనిషికి గురు వు అవసరం తప్పనిసరి అని.. ఎప్పుడు ఏది ఎంత అవసరమో తెలియజేస్తేనే మనిషి అటువైపు ప్రయాణించి ఉన్నతస్థాయికి చేరుకుంటాడని చెబుతాడు.’ మనిషికి కచ్చితంగా గురువు అవసరమవుతాడని, ఆ గురువే కేఎల్ యూనివర్సిటీ అని తెలియజేశారు. ప్రపంచంలో అన్ని దే శాల కంటే మన దేశంలోనే యువత అత్యధికంగా ఉన్నారన్నారు. మనిషి వయస్సును పరిగణలోకి తీసుకుంటే స రాసరి 28.17 వయస్సు గల వారు అత్యధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. యూఎస్ 51, చైనా 53, జపాన్ 48, ఇలా ఆయా దేశాల సగటు వయస్సు శాతం ఇలా ఉండడంతో మన దేశం ము న్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మన దేశంలో విద్యలో మూడోశాతం ఉందని, మొదటిస్థానంలో ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో కేఎల్ యూనివర్సిటీ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఒక నిర్ణీత సమయం లో డ్యూయల్ కోర్సులు చదివి వాటిలో ప్రావీణ్యం సంపాదించడం గొప్ప విషయమన్నారు. మున్ముందు కరెంట్ కూడా వైర్లెస్గా రావడం ఖాయమని, ఆ దిశగా టెక్నాలజీ పరుగులు పెడుతుందని తెలిపారు.
ఎన్ని అవమానా లు ఎదురైనా, ఇబ్బందులు తలెత్తినా అనుకున్న లక్ష్యం వై పు అడుగులు వేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూ చించారు. కేఎల్ యూనివర్సిటీ మీ లక్ష్యాలను నెరవేర్చడంలో తోడ్పడుతుందన్నారు. ‘కేఎల్’లో చదివిన విద్యార్థులు ప్రపంచ మంతటా వివిధ దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని వివరించారు. ఇంజినీరింగ్కు మున్ముందు ఎం తో భవిష్యత్తు ఉందన్నారు. విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ విద్యాబోధనతోపాటు 360 డిగ్రీల్లో కెరియర్ గైడెన్స్ను అందిస్తుందని తెలిపారు. 1983లో ఆరంభమైన కే ఎల్ యూనివర్సిటీ 40 ఏండ్లుగా వేలాదిమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించిన ఘనతను దక్కించుకుందన్నారు. ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి జీవితానికి భరోసా కల్పిస్తుందన్నారు. నచ్చినట్లుగా జీవిస్తూ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అనంతరం ఇంటర్ ఫస్టియర్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేయగా పలువురు విద్యార్థు లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ విజయ్కుమార్రెడ్డి, యాంకర్ ఆదిత్య, నమస్తే తెలంగాణ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మనిషి.. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఏదో నేర్చుకోవాలనే సంకల్పం మొదలవుతుందని ప్రతి భ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా ఆలోచించకుండా ఆరోగ్యం గా, సంతోషంగా ఉండాలని గర్భిణులకు పెద్దలు చెబుతుంటారన్నారు. డాక్టర్లు సైతం ఇలాగే సూచిస్తారన్నారు. గర్భం నుంచి బిడ్డ ఆరోగ్యంగా జ న్మించి సమాజానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని, అక్కడి నుంచే మనిషి జీవితం ఆరంభమవుతుందని తెలిపారు. ప్రతిభ కళాశాల విద్యార్థులు సైతం ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలియజేశారు. నేర్చుకునే పనిలో స్పష్టత ఉం డాలని, అప్పుడే మనం అనుకున్న స్థాయికి చేరుకుంటామన్నారు. యువత ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్ర తి బిడ్డ ఆరోగ్యంగా ఉంటూ తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. 83 మందికి తమ కళాశాల శిక్షణ ఇవ్వగా 55 మంది నీట్లో ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలలో 2,500 మంది విద్యార్థులు ఉండగా ఎంతోమంది మంచిస్థానాలను చేరుకున్నారని తెలిపారు. సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వచ్చి “మాకు ఉద్యోగం వచ్చింది.. మీ ఆశీర్వాదం కావాలి సార్” అని చెబుతుంటే చెప్పలేనంత సంతోషం కలిగిందని, ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలన్నారు. ప్రతి క్షణం ధర్మంవైపు నిలబడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు. విద్యార్థి నిర్లక్ష్యాన్ని వీడి అలుపెరగని బాటసారిలా శ్రమిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని తెలిపారు. చేసే పనిలో స్పష్టత, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే తపనతో ముందుకు సాగితే విజయం మీవెంటే నడుస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇలాంటి శిక్షణ తరగతులను విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిభ కళాశాల విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీలోనూ చ దువుతున్నారని చెప్పడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.
తమ విశ్వవిద్యాలయంలో చదివే వారి జీవితానికి భరోసా కలుగుతుందని కేఎల్ యూనివర్సిటీ మేనేజర్ వెంకటేశ్ అన్నారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ (బీ.టెక్) చదివే విద్యార్థులకు ఒకేసారి రెండు కో ర్సులు పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. బీటెక్ చదువుతున్న కాల వ్యవధిలోనే వారి స్కిల్స్ను పరిగణలోకి తీసుకుంటూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలను పొందేందుకు కేఎల్ యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుందన్నారు. తమ విశ్వవిద్యాలయం మెరిట్ స్టూడెంట్స్కు రూ.100 కోట్ల స్కాలర్షిప్లను అందిస్తుందని చెప్పారు. రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీతో కేల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని వివరించారు. దేశ విదేశాల్లోనూ 70 నుంచి 80 యూనివర్సిటీలతో ‘కేఎల్’కు అనుబంధం ఉందని.. వారితో సంప్రదింపులు జరిపి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉం చే బాధ్యత తీసుకుంటామన్నారు. న్యాక్ అందించే నా లుగు మార్కుల్లో కేఎల్ యూనివర్సిటీ 3.86 మా ర్కులు సాధించిందన్నారు. మైక్రోసాఫ్ట్, విప్రోతోపా టు పలు పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపి సం బంధిత అధికారుల సమక్షంలో ప్రత్యేక సిలబస్తో కూడిన పుస్తకాలను తయారు చేస్తారన్నారు. ఒక్కో వి ద్యార్థికి రెండు, మూడు ప్లేస్మెంట్లు రావాలని ఆ కాంక్షించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా కేఎల్ యూనివర్సిటీ ఫోన్ నెంబర్ 9133926000 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ త ర్వాత ఎలాం టి కోర్సు తీ సుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. బాగా చదివి తే భవిష్యత్తు లో ఎలాంటి ప్యాకేజీలు వస్తాయనే వి షయాలను వివరించారు. కేఎల్ యూనివర్సిటీలో చోటు దక్కించుకొని చదవాలని ఉన్నది. ఈ సదస్సు మాకు చాలా ఉపయోగకరంగా ఉంది.
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సదస్సులో ఇంజినీరింగ్ విద్య గురించి చక్కగా వివరించారు. భవిష్యత్తులో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై అవగాహన వచ్చింది. అత్యధిక ప్యాకేజీ ఇచ్చే కంపెనీ ల్లో స్థానాన్ని దక్కించుకోవడానికి ఈ సదస్సులు ఉపయోగపడతాయి. విద్య నేర్చుకునే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. మాకు నచ్చిన కోర్సును ఎంచుకునే విషయంలో చాలా ప్రోత్సాహం, అవగాహన కలిగింది. ఇలాంటి అవగాహన సదస్సులు మాకు చాలా అవసరం.