వనపర్తి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ యాస్మిన్బాషాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్ల విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అనధికార కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
– వనపర్తి, నవంబర్ 28(నమస్తే తెలంగాణ)
వనపర్తి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ షేక్యాస్మిన్బాషాతో కలిసి ఆయా శా ఖల అధికారులతో రెండు పడకల గదులు, రోడ్ల విస్తర ణ, జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, అనధికార కట్టడాలు, అమరవీరుల స్తూపం, డ్రగ్స్ స్టోర్ నిర్మాణ అంశాలపై మాట్లాడారు. కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని, డీఎస్పీ, ట్రాఫిక్ పోలీసు, ఏస్పీ కార్యాలయం వరకు రో డ్డు వేయాలని సూచించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రోడ్ల విస్తరణ వెంటనే చేపట్టాలన్నారు. అమరవీరుల స్తూపం ఏర్పాటుకు త గిన చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ స్టోర్ కు స్థలం కేటాయించాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. శ్రీరంగాపూర్ మండలంలో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని, ఖిల్లాఘణపురం మండలంలో రెండు పడక గదుల ఇం డ్లు, రేవల్లి మండలంలోని స్థలాలను అర్హులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అపూర్వరా వు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, డీపీవో మల్లయ్య, తా సిల్దార్ రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.