మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 31 : జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం నుంచి ఈనెల 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. ఆదివారం మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ మైదానంలో టోర్నీ ఏర్పాట్లను అండర్-17 సెక్రటరీ రమేశ్బాబు, టోర్నీ ఆర్గనైజర్ జియావుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్బాబు మాట్లాడుతూ టోర్నీలో పది జిల్లా జట్లు పాల్గొంటాయని, 320 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్లు, అఫీషియల్స్ హాజరుకానున్నట్లు తెలిపారు. బాలికలకు మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ మైదానం, బాలురకు శ్రీరామ్ల్యాండ్ మార్క్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 4గంటలకు టోర్నీ ని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా డీఈవో రవీందర్, హెచ్సీఎం అధ్యక్షుడు, హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
బాలుర జట్టు.. రక్షిత్, రాఘవతేజ్, సకురామ్, అశోక్, సమీ,సాత్విక్, స ఖీబుద్దీన్, శివకుమార్, సాయికుమార్, పవన్, షఫీఉర్-రహెమాన్, ప్రశాంత్, బి.ప్రశాంత్, చరణ్, సౌద్మహమూద్.
బాలికల జట్టు.. నందిని, సరిత, శ్రావణి, కృష్ణవేణి, అమూల్య, రాధిక, లక్ష్మీ ప్రియ, సునీతారెడ్డి, భావన, దీక్షిత, భవిత, శ్రీజ, సోని, శ్వేత.