ధన్వాడ/దామరగిద్ద, జనవరి 10 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆరుగ్యారెంటీల పథకాలను ప్రతి ఇం టికీ అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని రైతువేదిక వద్ద 53మంది మహిళల కు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రా మాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పా టు తు లం బంగారం అందిస్తామని వెల్లడించారు. దా మరగిద్ద మండలం ఎల్సన్పల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాని కి బుధవా రం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ధన్వాడ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మా జీ చైర్మన్ నిరంజన్రెడ్డి, ఎంపీటీసీలు మాధవి, సుధీర్కుమార్రావు, సర్పం చులు చంద్రప్ప, విమలమ్మ, నాయకులు నరహరి, సుదర్శన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, శివరాములు, లక్ష్మణ్గౌ డ్, ఏవో శివకుమార్, తాసీల్దార్ సిం ధుజా, ఎంపీడీవో శ్రీధర్, పీఏసీసీఎస్ చైర్మన్ ఈదప్ప, ఎంపీటీసీ బస్వరాజ్, నాయకులు పరిపూర్ణం, శరణ్యనాయక్ పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జనవరి 10 : మం డలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎమ్మెల్యే హాజరై మాట్లాడా రు. మండలం లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పార్టీలకతీతం గా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతుబంధు డబ్బులు అందించాలని సర్పంచ్ రా మ్మోహన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభు త్వం 200యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి బిల్లులు ఎందుకు వ సూలు చేస్తున్నారని కొల్లంపల్లి సర్పంచ్ సాయిరెడ్డి సభ లో ప్రశ్నించారు. గొర్రెల కోసం డీడీలు కట్టిన లబ్ధిదారులందరికీ గొర్రెలను పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, జెడ్పీకోఆప్షన్ తా జుద్దీన్, ఎంపీడీవో వెంకటయ్య, తాసీల్దార్ రా ణాప్రతాప్సింగ్, శోభారాణి పాల్గొన్నారు.
నారాయణపేట, జనవరి 10 : పట్టణంలో ని బస్టాండ్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ పా యింట్ను బుధవారం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ నో పార్కింగ్ జోన్లో నిలిపే వాహనాలకు భద్రతా సమస్యతోపాటు జరిమానా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం పార్కింగ్ పాయింట్ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సత్యనారాయణస్వామి ఆలయం ఆవరణలో గ్రామీణ వై ద్య సేవకుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు వే ణుగోపాల్, సదాశివరెడ్డి, వెంకటపతి, పృథ్వీరాజ్, సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, జమీర్పాషా, నారాయణరావు పాల్గొన్నారు.