గద్వాల, మార్చి 5 : రైతు సంక్షేమమే ధ్యే యంగా బీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తున్నది. రైతు లు సంబురంగా సాగు చేసుకునేందుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందజేస్తున్నది. రై తు మరణిస్తే ఆ కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకు రైతుబీమాతో అండగా నిలుస్తున్నది. దీంతోపాటు ధాన్యం, పప్పుశనగ తదితర పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నది. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మా ర్కెట్ను ఏర్పాటు చేసి కొనుగోలు చేయడంతో రైతులకు ట్రాన్స్పోర్ట్ బాధ తప్పింది. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా చే యూతనిస్తున్నది. జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి, పత్తి తర్వాత మిర్చి పం టను ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అలంపూర్ మండలాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తున్నారు.
వానకాలం సీజన్లో జిల్లాలో 24,537 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఎకరా పంట సాగు చేస్తే 12 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే, పంట అ మ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు ప డేవారు. హైదరాబాద్, కర్నూల్, గుంటూరు మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముకునేవారు. ఇది రైతులకు భారంగా మారింది. ఎంతో వ్యయప్రయాసాలకోర్చి పంటను తీసుకెళ్లినా సరైనా మద్దతు ధర రాకపోతే కొనుగోలుదారులు అడిగిన కాడికి అమ్ముకునేవారు. రైతుల బాధలను గుర్తించిన ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మిర్చి కొనుగోలుకు పూనుకున్నారు. కర్నూల్కు చెందిన ముగ్గురు కొనుగోలుదారులు ముందుకు రావడంతో కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్కూ ఆదాయం పెరగనున్నది..
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ మిర్చిని కొనుగోలు చేయడానికి మార్కెట్ లేనందున గుంటూరు, బెంగళూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి పంటను అమ్ముకునేవారు. రవాణా ఖర్చులు పెరగడంతోపాటు అక్కడకు వెళ్లిన తర్వాత మద్దతు ధర వచ్చినా రాకున్నా విక్రయించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్థానికంగానే కొనుగోలు చేయడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. మార్కెట్కు ఆదాయం కూడా పెరనున్నది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తుండడంతో సంబురంగా సాగు చేస్తున్నాం.
– వాసు, కుర్వపల్లి