మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ధీరుడు అంటు కొనియాడారు. అని ఫోన్ ట్యాంపరింగ్ కేసు విచారణలో కేసీఆర్కు సీట్ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్ను ఫోన్ ట్యాంపిగ్ కేసుకు సంబంధం లేదు. హైకోర్టు నిబంధనల ప్రకారం ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేపట్టాలి.. పోలీసులు నిబంధనల ను పక్కన పెట్టి గోడకు నోటీసులు అంటించడం సిగ్గు చేటన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన కేసీఆర్ను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు.
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దని నిష్పక్ష పాతంగా విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ సాధనలో కేసులు, జైళ్లకు భయపడలేదు కొట్లాడి పోరాటం చేసి రాష్టాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకులు అలీ మాస్కతి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రెహమాన్, గణేశ్, నవకాంత్, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.