మాగనూరు : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు( Maganur ) మండల కేంద్రంలో ఈ నెల 29 నుంచి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు( Brahmotsavams ) నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ,కార్యదర్శి భరత్ కుమార్, కోశాధికారి కృష్ణయ్య తెలిపారు. 29న బుధవారం నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఆలయ పూజారి రాములు ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు పల్లకి లో ఆలయానికి తీసుకు వస్తారని వివరించారు.
అనంతరంస్వామి వారికి అభిషేకం, నైవేద్యం, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 30న స్వామివారికి గంధలేపనం,విశిష్ట అభిషేక సేవ, మే1న ఉదయం ప్రభోత్సవం , స్వామివారి కల్యాణోత్సవం , గండ జ్యోతులు, సాయంత్రం గంగా పూజ, తెప్పోత్సవం, రాత్రి రెట్టపట్ల పోటీలు జరుగుతాయని తెలిపారు.
2న తెల్లవారు జామున 5 గంటలకు రథోత్సవం , సాయంత్రం పాల ఉట్లు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 3న శేషవాహన సేవా, గరుడ వాహన సేవా, సాయంత్రం4.55 గంటలకు హనుమాన్ వాహన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.