అలంపూర్, జనవరి 22 : ఐదో శక్తిపీఠంగా పేరొందిన అలంపూర్ జోగుళాంబ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. శుభకృత్ నామ సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి రోజైన ఆదివారం శాస్ర్తోక్తంగా.. సం ప్రదాయబద్ధంగా ఉత్సవాలు షురూ అయ్యా యి. జోగుళాంబ ఆలయం నుంచి పండ్లు, పూ లు, నూతన వస్ర్తాలు, మంగళ వాయిద్యాలతో అర్చకులు, ఆలయ ఈవో పురేందర్, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సభ్యులు బయలుదేరి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామికి వస్త్ర అలంకర ణ చేసి త్రిశూల రాజంతో పల్లకీలో తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
అక్కడ జోగుళాంబ దేవిని అలంకరించి స్వామిని చెంతకు చేర్చారు. వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆనతి స్వీకరణ, జోగుళాంబ ఆలయంలో గో మాత, గణపతి, పుణ్యాహవాచనం, మహాకల శ స్థాపన, ఆవాహిత దేవతా హోమాలు, బలిహరణ, నీరాజ మంత్ర పుష్ప పూజలు జరిపా రు. ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశా రు. భక్తులు హాజరై అమ్మవారు, స్వామికి కృప కు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు, ఆలయ సి బ్బంది, భక్తులు పాల్గొన్నారు.