గద్వాల టౌన్, ఫిబ్రవరి 23 : గద్వాల సంస్థానంలో కొలువుదీరిన శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంస్థానాధీశుల కాలంనాటి లింగంబావిలో స్వామివారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష ఫల పంచామృతాభిషేకం చేసి సాయంత్రం ఆలయం నుంచి లింగంబావి వరకు ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం లింగంబావిలోని ఆలయం వద్ద శ్రీ భూదేవి, లక్ష్మీదేవిలతోపాటు చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా
హాజరై పూజలు నిర్వహించారు. స్వామివారిని ద ర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సంస్థానాధీశుల కాలంనాటి లింగంబావిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు.