పాలమూరు, ఫిబ్రవరి 8 : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరిలో వెలసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయాభివృద్ధికి రూ.6 కోట్ల జీవో కాపీని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అద్భుంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు, శబరి గిరీష భక్త బృందం జనార్దన్ గురుస్వామి, కురుమూర్తి స్వామి పాల్గొన్నారు.