మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 1 : వందేళ్ల చరిత్ర చూసినా అందరూ మెచ్చుకొనేలా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సతీ సమేతంగా హాజరవ్వగా వీరికి గౌడ సంఘం నాయకులు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న గౌడ భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ పౌరుడిగా జీవనం సాగించి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. తన ఎదుగుదలను మహబూబ్నగర్ జిల్లా ప్రజల చూపుతున్న ఆదరాభిమానాలను చూసేందుకు తన తల్లిదండ్రు లు ఉంటే ఎంతో సంతోష పడేవారని మంత్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్గౌడ్, గౌడ సంఘం నాయకులు సాయిలుగౌడ్, శ్రీధర్గౌడ్, నారాయణగౌడ్, బాగన్నగౌ డ్, రాజశేఖర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్గౌడ్, క్రాంతికుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జంగల్ సఫారీ ప్రారంభం..
వేలాది రకాల పక్షుల సమాహారంగా తీర్చిదిద్దుతున్న బర్డ్స్ ఎన్ క్లోజర్ 26 వేల ఎకరాల్లో జంగల్ సఫారీని రాజసభ సభ్యుడు సంతోష్కుమార్తో కలిసి సోమవారం ప్రారంభించునున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎస్వీఎస్ ఎదురుగా ఉన్న నిర్మల్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసి కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన సతీసమేతంగా హాజరుకాగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తిరుమల హిల్స్లో స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్ అందజేశారు. కార్యక్రమం లో కమ్మ సంఘం నాయకులు రమణయ్య, కొండ య్య, సుబ్బయ్య, మాల్యాద్రి, నారాయణరావు, బాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోట రత్నం, సాయిలీల ఉన్నారు.
ప్రధానికి తెలంగాణ అంటేనే ద్వేషం..
ప్రధానమంత్రి మోదీ మహబూబ్నగర్కు వస్తాడు.. పోతాడు కానీ.. ఈ ప్రాంతానికి చేసేంది ఏమీలేదని, ఆయనకు ఈ ప్రాంతమంటేనే ద్వేషమని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఇప్పటికే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా హామీ ఇచ్చి ముచ్చటగా మూ డుసార్లు మోసం చేశారని.. మళ్లీ ఈ ప్రాంత ప్రజలను వంచించేందుకు మరోసారి వస్తున్నారని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బీసీ వృత్తిదారులు, మైనార్టీలు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వందశాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న రూ.లక్ష సాయానికి సంబంధించిన చెక్కులను 34 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎసీ,ఎస్టీ,బీసీ మైనారిటీల్లోని పేద ప్రజలందరికీ వివిధ పథకాల ద్వారా తమ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. బీసీ ప్రధానమంత్రి అయినా బీసీలకు మోదీ చేసిందేమీలేదన్నారు. తాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి అభివృద్ధి సంక్షేమం కోసం కష్టపడుతున్నామని… కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు విని మోసపోవద్దని మంత్రి ప్రజలకు హితవు పలికారు.
ప్రతిఒక్కరి సంక్షేమానికి కృషి
మహబూబ్నగర్, అక్టోబర్ 1 : ప్రజలకు మంచి చేయాలనే తపనతో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మీ నమ్మకం రెట్టింపు అయ్యేలా ప్రతి ఒక్కరి సం క్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో జిల్లా ఫ్రూట్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ నిసార్, ఉపాధ్యక్షులు మహ్మద్ షాహీద్, మధుసూదన్, అమీర్హుస్సేన్, ప్రధా న కార్యదర్శి మహమ్మద్తోపాటు 200 మందికి పైగా వ్యాపారులు బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ కార్యదర్శి ఇమ్రాన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అదేవిధంగా పట్టణానికి చెందిన సామజిక కార్యకర్త తయ్యబ్ బష్వార్, నాయకులు అబ్దుల్ సన్ని, అబ్దుల్ హకీం, లతీ ఫ్, జుబేర్, మహమ్మద్, హసన్తోపాటు మరో 100మందికి పైగా బీఆర్ఎస్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో చేరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి బుద్ధ భవన్ సమీపంలో రూ.20లక్షలతో చేపట్టిన సెర్ప్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
సుందరపట్టణంగా మహబూబ్నగర్
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 1 : సుందరపట్టణం గా మహబూబ్నగర్ను తీర్చిదీద్దుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని 24,32, 33,37,38,42,43,45,48వవార్డులో రూ.9 కోట్ల 50లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పట్టణాభివృద్ధి పట్టించుకోలేదని, వార్డులో సమస్యలు, తాగునీటీ సమస్యలతో ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తమ ప్రభు త్వం హయాంలో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. పట్టణ రోడ్ల విస్తరణ, ప్రధాన రోడ్డు, బైపాస్ రోడ్డు, జంక్షన్ల సుందరీకరణ, పార్కులు ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.