పాలమూరు, ఏప్రిల్ 6 : హనుమంతుడు భక్తికి, బలానికి ప్రతీక అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు. అనంతరం టీడీ గుట్టలోని కోయిలకొండ ఎక్స్రోడ్డు వద్ద రూ.28.70లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్ను ప్రారంభించారు. అదేవిధంగా బ్రాహ్మణవాడీ, శ్రీనివాసకాలనీ, మర్లులోని అంజనాద్రినగర్, మోనప్పగుట్టలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో నిర్వహించిన హనుమాన్జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు, హనుమాన్చాలీసా పఠనంతోపాటు హోమాల్లో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. టీడీగుట్టలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఎలాంటి విఘాతాలు కలుగకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని స్వామిని వేడుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు, ఆలయాల కమిటీసభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని.. దీంతో ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం పోతనపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వందమంది యువజన నాయకులు మంత్రి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, నాయకులు పాండురంగారెడ్డి, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, ఖాదర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.