మహబూబ్నగర్టౌన్, జనవరి 27 : తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో శుక్రవారం తల్లిదండ్రులు శాంతానారాయణ స్మారక టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పురస్కరాలు అందిస్తున్నామన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారుకుల 2శాతం క్రీడా కోట అమలు చేస్తున్నామన్నారు. యువత సోషల్ మీడియాకు ఆకర్షితులు కాకుండా సరైన మార్గంలో నడిచి క్రమశిక్షణతో తమ జీవితాల్ని చక్కదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో మెగా జాబ్మేళా నిర్వహించి సుమారు 4500మంది నిరుద్యోగులకు ప్రైవేట్రంగంలో ఉద్యోగాలను కల్పించామన్నారు. త్వరలో మరో జాబ్మేళా నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, కౌన్సిలర్ కిశోర్, నిర్వాహకులు నరేశ్, రాజేశ్, పవన్, రాజేందర్, గిరి, వీరేశ్,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
– ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
‘కంటివెలుగు’ను వినియోగించుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ తిరుపతమ్మ, బీఆర్ఎస్ నాయకులు నవకాంత్, మోతీలాల్, పురుషోత్తం, డీఎంహెచ్వో కృష్ణ, భాస్కర్నాయక్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.